PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలను రెచ్చగొట్టే వార్తలు వ్రాయటం సరికాదు

1 min read

– నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్ర ప్రభుత్వం పై,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై,రాష్ట్ర పోలీస్ యంత్రాంగంపై,అర్థరహితమైన వార్తలను ప్రచురిస్తు.ప్రజలను తప్పుదోవపట్టించి,రెచ్చగొట్టే విధంగా అబద్ధపు రాతలు రాస్తున్నఈనాడు పత్రికను ప్రజలందరూ బహిష్కరించాలని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పిలుపునిచ్చారు. పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించి ఈనాడు పత్రికా ప్రతులను పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగిందని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు,పార్టీప్రముఖులు,మహిళా కార్యకర్తలు,అభిమానులు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author