PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నెల‌కు రూ. 20 వేలిస్తా.. వైద్యుడి కీచ‌క ప‌ర్వం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దివ్యాంగుడైన తన తండ్రికి సదరం సర్టిఫికెట్‌ కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ పట్ల ఓ వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించాడు. సదరం సర్టిఫికెట్‌ కావాలంటే తనతో ఏకాంతంగా గడపాలని, తనతో పర్మినెంట్‌గా ఉంటే నెలకు రూ.20 వేలిస్తానని ఒత్తిడి చేశాడు. ఆ డాక్టర్‌ వేధింపులు భరించలేక సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకొచ్చింది. తెలంగాణలోని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సంఘటన వెలుగుచూసింది. ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన మహిళ.. ఖమ్మం జిల్లాకు చెందిన తన తండ్రికి సదరం సర్టిఫికెట్‌ కోసం గత నెల 7న ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఓపీ రాయించుకున్నాక రూమ్‌ నంబర్‌ 8లో ఉన్న డాక్టర్‌ని కలవాలని చెప్పడంతో లోపలికి వెళ్లింది. సర్టిఫికెట్‌ పేరుతో ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకున్న డాక్టర్‌ ఆ తర్వాత నుంచి ఆమెకు పలుమార్లు ఫోన్‌ చేయడం మొదలుపెట్టాడు. సదరం సర్టిఫికెట్‌ కావాలంటే తనకు శారీరకంగా సహకరించాలని, పర్మినెంట్‌గా తనతోనే ఉంటే నెలకు రూ.20 వేలు చెల్లిస్తానని ఒత్తిడి చేశాడు.

                               

About Author