NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అది `భీమ్లా నాయ‌క్` విడుద‌ల‌కు ముందే వ‌చ్చి ఉంటే బాగుండేది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచుతూ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో పై నిర్మాత సీ. క‌ళ్యాణ్ స్పందించారు. ఈ జీవో భీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌ల‌కు ముందే వ‌చ్చి ఉంటే బాగుండేద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ‘‘ఏపీ ప్రభుత్వం వెలువరించిన కొత్త జీవోతో ఎన్నో సంవత్సరాల సమస్యలకు చెక్‌ పెట్టినట్టైంది. కొవిడ్‌ కన్నా పాత జీవో నం. 35తోనే డిస్ట్రిబ్యూటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. కొత్త జీవో సంతృప్తికరంగా ఉంది. ఇదే జీవో ‘భీమ్లానాయక్‌’ విడుదలకు ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. చిన్న చిన్న సమస్యలను మేం పరిష్కరించుకుంటాం. ప్రభుత్వాలు, చిత్ర పరిశ్రమ ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఏర్పడిన గ్యాప్‌ను పూడ్చడానికి చిరంజీవిగారు కృషి చేశారు. పరిశ్రమ సమస్యలు పరిష్కరించేందుకు చిరంజీవి ముందుకురావడం అభినందనీయం“ అని అన్నారు.

                                            

About Author