PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏం జ‌రుగుతుందో జ‌గ‌న్ కు ముందే తెలుసు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : వ‌చ్చే 10 రోజుల్లో హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని… ముందే గ్రహించిన ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును  ఉపసంహరించుకుందని వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాజధాని కోసం అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగించాలని  రఘురామ సూచించారు. సీఆర్డీఏలో రాజ్‌భవన్, సెక్రటేరియట్, హైకోర్టు ఉంటాయని, గతంలో అగ్రిమెంట్ రాశారని ఆయ‌న అన్నారు. మూడు రాజధానులతో వస్తామని నిన్న సీఎం జగన్ స్పష్టం చేశారని, 3 రాజధానుల అంశంలో ప్రభుత్వం వెనక్కి వెళ్ల‌లేద‌న్నారు.  అభివృద్ధి వికేంద్రీకరణకు, రాజధానికి సంబంధం లేదని, ఇప్పటికైనా సీమ రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.

About Author