NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమూల్ బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : రాష్ట్రంలో సీఎం జగన్ అమూల్ డైరీ ప్రమోటర్ గా మారారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని పాలను అమూల్ కు కట్టబెట్టి పాడి రైతులను వదిలేశారని విమర్శించారు. పాదయాత్ర సమయంలో లీటర్ కు రూ. 4 బోనస్ ఇస్తామన్న హమీ ఏమైందని ప్రశ్నించారు. అమూల్ పై చూపుతున్న శ్రద్ధ పాడిరైతులపై ఎందుకు చూపడం లేదన్నారు. పాడి రంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, పాడి రైతులకిచ్చిన హామీల అమలులో వైఫల్యం, అమూల్‌ ముసుగులో సహకార డెయిరీలను నిర్వీర్యం చేయడంపై ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు. పాడి పరిశ్రమ నిధులతోపాటు ఉపాధి హామీ నిధులను సైతం అమూల్‌ కోసం దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.

About Author