PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్‌ బయోపిక్‌

1 min read

పల్లెవెలుగు వెబ్​: వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మలయాళ హీరో మమ్ముట్టి ప్రధానపాత్రలో డైరెక్టర్‌‌ మహి.వి.రాఘవ ‘యాత్ర’ పేరుతో తెరకెక్కించిన సినిమా హిట్‌ కొట్టింది. వైఎస్ పాదయాత్రని హైలెట్ చేస్తూ తీసిన ఈ చిత్రం ఆయన అభిమానులకు బాగా నచ్చింది. ఇదే దర్శకుడు ఇప్పుడు వైఎస్ జగన్ లైఫ్ స్టోరీతో జగన్‌ బయోపిక్‌ చేయబోతున్నాడు. రాజశేఖర్ రెడ్డి మరణానికి ముందు ఈ కథ మొదలవుతుందట. ఆయన మరణం తర్వాత పరిస్థితులు, జగన్ సొంత పార్టీ పెట్టడం మొదలు 2019 ఎన్నికల్లో ఏపీ సీఎంగా ఆయన ఎలా ఎదిగారు అన్నది ఇందులో చూపించబోతున్నారట. అయితే జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి నెలకొంది. మొదట ఆ పాత్రలో సూర్య నటిస్తాడేమో అని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా పాత్రకి బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీని ఎంపిక చేశారట. ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ లో హర్షద్ మెహతా పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు ప్రతీక్. పోలికలతో పాటు నటనలోనూ జగన్ పాత్రకి తను హండ్రడ్ పర్సంట్ న్యాయం చేస్తాడని నమ్ముతున్నారట. మహి చెప్పిన కథ నచ్చి ప్రతీక్ వెంటనే ఈ సినిమాకి సైన్ కూడా చేశాడంటున్నారు. తననే ఈపాత్రకి తీసుకోవడం మరో కారణం కూడా ఉంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తారని తెలుస్తోంది. కానీ ఇది ‘యాత్ర’ సినిమాకి సీక్వెల్ లా కాకుండా డిఫరెంట్ స్క్రిప్ట్ తో ప్లాన్ చేశారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా, మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక కూడా చేస్తున్నారట.

About Author