PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ముస్లిం మైనార్టీల ద్రోహి జగన్..

1 min read

– టిడిపి హయంలోనే  ముస్లిం మైనార్టీల సంక్షేమం

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ముస్లిం  మైనార్టీల ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని టిడిపి మండల మైనార్టీల సంఘం  అధ్యక్ష కార్యదర్శులు గుండు ఫక్రుద్దీన్, మీరా హుస్సేన్లు అన్నారు.గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో వారు మాట్లాడుతూ, గత టిడిపి హయంలో మైనార్టీ సంక్షేమ రుణాలు, రంజాన్ తోఫా, దుల్హన్ పథకం ద్వారా పెళ్ళికానుక వంటి ఎన్నో పథకాలు అందాయని, వైసిపి ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలన్నీ రద్దు చేశారన్నారు. రాష్ట్రంలో షాదీ ఖానాల నిర్మాణాలు జరిగింది కూడా టిడిపి హయాంలోనేనని వారు గుర్తు చేశారు. పత్తికొండ పట్టణం నందు  టిడిపి ప్రభుత్యం లో  మన ముస్లిం లకు  మైనార్టీ సంక్షేమ రుణాలు, రంజాన్ తోఫా, దుల్హన్ పథకం ద్వారా పెళ్ళికానుక వంటి ఎన్నో పథకాలు టిడిపి ప్రవేశపెట్టిందన్నారు. వైఎస్ఆర్  ప్రభుత్యం వచ్చి దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు కావొస్తుంది. ఈ నాలుగున్నర సంవత్సరాలలో పత్తికొండ పట్టణ ముస్లిమ్స్ కు ఏ పథకాలు అమలు చేశారు బహిరంగ చర్చకు సిద్ధంమా అని సవాళ్లు చేశారు. మీరు చేసిందల్లా ఒక్కటే వైసిపి ఇసుక మాఫియా విధానం ద్వారా పత్తికొండ ప్రాంతంలో బేల్దారి పనులపై జీవిస్తున్న వందలాది మైనార్టీకుటుంబాలుఉపాధినికోల్పోయాయన్నారు. వైసిపి చేసిన తప్పులను కప్పి పుచ్చేందుకు ఆ పార్టీ నేతలు నాయకులు మత గ్రంథాలను, ప్రార్థన మందిరాలను వాడుకుంటున్నారని ఇది మంచిది కాదన్నారు. పత్తికొండలో వైసిపి మైనార్టీ నాయకుడు మజీద్ లో పార్టీ ప్రచారం నిర్వహించడం సిగ్గచే టన్నారు. మతాన్ని గౌరవించలేని మీరు నాయకులా అని ప్రశ్నించారు.  పట్టణంలో ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేని మైనార్టీలకు ఏం చేశారని మహిళలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక వెల్లిపోయారన్నారు. ఈ సమావేశంలో టిడిపి మైనార్టీ సంఘం నాయకులు హుస్సేన్ సాహెబ్, ఖాసీం వలీ, భాష, అంగదాటి హుస్సేన్, పీర్ మొయినిద్ధిన్, రెహమాన్, రహంతుల్లా, రోషన్ వలి పాల్గొన్నారు.

About Author