PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రాన్ని పాలించే ఏకైక నాయకుడు జగన్

1 min read

– చంద్రబాబు జైలు నుండి బయటికు రావడానికి ఎన్నో కారణాలు.. 

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో గురువారం సాయంత్రం పల్లెకు పోదాం అనే కార్యక్రమం గ్రామ సర్పంచ్ టి. ఉషారాణి అధ్యక్షతన జరిగినది.ఈ సందర్భంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పాలించే ఏకైక వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మండల జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు జైలు నుండి బయటకి రావడానికి ఆయన ఎన్నెన్నో కారణాలు చెబుతూ బయటికి వచ్చారని అన్నారు.తర్వాత వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి,ఏఎంసీ మాజీ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు గురించి ప్రజలు నాయకుని దగ్గరికి వెళ్లకుండానే ప్రజల వద్దకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఏ గ్రామంలో చూసుకున్నా కోట్ల కొద్దీ సంక్షేమ పథకాలకు మరియు అభివృద్ధి పనులకు నిధులు వచ్చాయని వారు అన్నారు.గత నాలుగున్నర సంవత్సరాల పాలనలో ప్రభుత్వం 90 శాతం హామీల పనులను నెరవేర్చిందని రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి బాటలోకి తీసుకు వెళ్తున్న జగనన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రభుత్వం వచ్చే విధంగా కృషి చేయాలని వారు అన్నారు.మా నమ్మకం నువ్వే జగన్ అనే సంక్షేమ పథకాల నగదు వివరాల బోర్డును వారు ప్రారంభించారు.అనంతరం గ్రామంలో పార్టీ జెండాను వారు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రా హత్,ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,  జబ్బార్,సొసైటీ చైర్మన్ తులసి రెడ్డి,వైస్ ఎంపీపీ టి.నబి రసూల్,జెసిఎస్ మండల కన్వీనర్ రవి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి వివిధ గ్రామాల నాయకులు తువ్వా రామ నాగేశ్వర రెడ్డి,మల్లేశ్వర రెడ్డి,పెద్ద మౌలా,పుల్లయ్య,అబ్దుల్ ఘని మరియు పంచాయితీ కార్యదర్శి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author