PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ వివేకాను చంపిందెవ‌రో జ‌గ‌న్ కు తెలుసు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కొంద‌రు పెద్దలు త‌ప్పించుకుని.. త‌న అన్న సునీల్ యాద‌వ్ ను ఇరికిస్తున్నార‌ని సునీల్ యాద‌వ్ త‌మ్ముడు కిర‌ణ్ యాద‌వ్ ఆరోపించారు. ఆ పెద్ద వాళ్లు, సీబీఐ అధికారుల నుంచి త‌మ కుటుంబానికి ప్రాణ‌హాని ఉంద‌ని కిర‌ణ్ యాద‌వ్ మీడియా ఎదుట వాపోయాడు. వైఎస్ వివేకాను హ‌త్య చేసిందెవ‌రో జ‌గ‌న్ కు, ప్రజ‌ల‌కు తెలుస‌న్నారు. సీబీఐ అధికారులు లేనిపోనివి సృష్టిస్తూ.. కాలువ‌లో మార‌ణాయుధాలు ఉన్నాయ‌ని వెతికిస్తూ.. సునీల్ యాద‌వ్ ను నిందితుడిగా చూపే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని కిర‌ణ్ యాద‌వ్ ఆరోపించారు. ఇంత‌కు ముందు మాట్లాడ‌ని వాచ్ మెన్.. రెండు సంవ‌త్సరాల త‌ర్వాత ఎందుకు సునీల్ యాద‌వ్ పేరు చెప్పార‌ని ప్రశ్నించారు. ద‌ర్యాప్తు విష‌యంలో త‌మ కుటుంబానికి అన్యాయం జ‌రుగుతుంద‌ని సీఎంను క‌లిసి చెబుదామ‌నుకుంటే.. సీబీఐ అధికారులు అడ్డుకుంటున్నార‌ని కిర‌ణ్ యాద‌వ్ తెలిపారు.

About Author