NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీసీలకు అత్యున్నత స్థానం కల్పించిన – జగన్ మోహన్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అట్టడుగున ఉన్న ఎన్నో బీసీ కులాలకు ప్రభుత్వ, పార్టీ పదవులు కల్పించి వారికి గుర్తింపునిచ్చారని కర్నూలు బీసీ సెల్ రీజనల్ కో ఆర్డినేటర్ నాగరాజు యాదవ్ అన్నారు. గురువారం కర్నూలు ఉమ్మడి జిల్లాల బీసీ సెల్ సమావేశం నగరంలోని కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలందరు నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా గుర్తింపు పొందారన్నారు. రాబోయే కాలంలో బీసీలందరం ఒక్కటై ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమశేఖర్, నంద్యాల జిల్లా అధ్యక్షులు ప్రసాద్, ధనుంజయ ఆచారి, బత్తుల లక్షయ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author