PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న్ ఇంత ఘోరంగా విఫ‌ల‌మ‌వుతార‌ని ఊహించ‌లేదు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో ఘోరంగా వైఫ‌ల్యం చెందార‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. రాజమండ్రిలో ఆయ‌న మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్ర‌భుత్వానికి అప్పుల‌పై నియంత్ర‌ణ లోపించింద‌న్నారు. రెండేళ్ల‌లో వైకాపా ప్ర‌భుత్వం 3ల‌క్ష‌ల కోట్ల అప్పు చేసింద‌న్నారు. 3 రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహరించుకుని మ‌ళ్లీ పెడ‌తాం అనడం ప్ర‌భుత్వం వైఫ‌ల్య‌మేన‌ని అన్నారు. ప్ర‌తిప‌క్షాలు లేకుండా చేయాల‌నుకోవ‌డం అవివేక‌మ‌ని అన్నారు. ప్ర‌తిప‌క్షాల స‌ల‌హా తీసుకుంటేనే మంచి పేరు వ‌స్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇసుక‌, పెట్రోల్, మ‌ద్యం, క‌రెంట్ ఇలా అన్ని ధ‌ర‌లూ పెంచుకుంటూ పోతున్నార‌ని, ఉన్న‌న్నాళ్లు అప్పులు చేసి చివ‌ర్లో రాష్ట్రాన్ని రోడ్డున ప‌డేయ‌డ‌మే వైకాపా ఉద్దేశ‌మ‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన అప్పులు తీసుకురావ‌డానికి కొత్త అప్పులు తీసుకొస్తామ‌ని చెప్ప‌డం దుర్మార్గ‌మ‌న్నారు.

About Author