PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమాస్తుల కేసు నుంచి తొల‌గించాల‌ని కోరుతూ జ‌గ‌న్ పిటిష‌న్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : అక్రమాస్తుల కేసుల్లోని ఏపీహెచ్ బీ గృహ నిర్మాణ ప్రాజెక్టుల చార్జీషీట్ నుంచి తొల‌గించాల‌ని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీబీఐ కోర్టులో డిశ్చార్జీ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌పై సీబీఐ త‌ప్పుడు అభియోగాలు మోపింద‌ని సీఎం జ‌గ‌న్ కోర్టుకు తెలిపారు. అదే కేసులో ఏ2 గా ఉన్న విజ‌య‌సాయి రెడ్డి కూడ త‌న పేరు తొల‌గించాల‌ని కోరుతూ డిశ్చార్జీ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. వాద‌న‌లు విన్న కోర్టు విచార‌ణ సెప్టంబ‌ర్ 3కి వాయిదా వేసింది. పెన్నా కేసులో జ‌గ‌న్ డిశ్చార్జీ పిటిష‌న్ పై కౌంట‌ర్ దాఖ‌లుకు సీబీఐ మ‌రోసారి గ‌డువు కోరింది.

About Author