PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న్ .. టీడీపీ కంటే ధ‌ర‌లు త‌గ్గించి చూపాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీఎం జగన్… టీడీపీ కంటే ధరలు తగ్గించి చూపించాలని బీజేపీ నేత క‌న్నాల‌క్ష్మినారాయ‌ణ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నవరత్నాలు అమలు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 7వ సారి కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క దానిపై ధరలు పెంచారని మండిపడ్డారు. చాక్లెట్ ఇచ్చి నక్లెస్ తీసుకున్నట్లు జగన్ ప్రభుత్వ పాలన ఉందని విమర్శలు గుప్పించారు. పెంచిన విద్యుత్ చార్జీల తగ్గించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

                                      

About Author