PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబుపై జగన్ రెడ్డి రాక్షస  కుట్ర.. !

1 min read

– వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి

– చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించిన మాండ్ర

– చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు రాస్తారోకో

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును  అక్రమ అరెస్టు కు  నిరసనగా నందికొట్కూరు పట్టణంలో టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి  ఆధ్వర్యంలో శనివారం పటేల్ సెంటర్ లో టీడీపీ నాయకులు కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు ను బేసరత్తుగా విడుదల చేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాండ్ర శివానంద రెడ్డి మాట్లాడుతూ  చంద్రబాబు నాయుడు అరెస్టు దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కక్ష సాధింపు చర్యలు తగదన్నారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అక్రమంగా అరెస్టు చేయడం శోచనీయమన్నారు. అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా నందికొట్కూరు లో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను బందు చేశారు.పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భద్రత చర్యలు చేపట్టారు.  ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్చార్జ్  జయ సూర్య,వెంకటేశ్వర్లు యాదవ్, సంపత్ కుమార్ యాదవ్,అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి, మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి, కాతా రమేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,షకీల్ అహ్మద్, ముర్తుజావలి, గిరీశ్వర్ రెడ్డి,  ఓబుల్ రెడ్డి,మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఖలీలుల్ల బేగ్, లాడెన్, ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు జయకర్,కళాకరు,నిమ్మకాయల రాజు,ప్రవీణ్ రగడ,బొల్లెద్దుల్లా రాజన్న, రవి చౌదరి, బ్రహ్మయ్య, ప్రభు కుమార్, షేక్షావలి, పాలమరి నాగరాజు, పి.శేఖర్, మాణిక్య రాజు, నరసింహారెడ్డి, ప్రవీణ్, మద్దిలేటి, తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.

About Author