PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల మేలు కోసమే… జగనన్న సురక్ష

1 min read

కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు

పల్లెవెలుగు, ఏలూరు:  ప్రజలకు మేలైన సేవలు అందించాలని అర్హులైన వారికి అన్యాయం జరగకూడదని అందరికీ మంచి జరగాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారని కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. శాసనసభ్యులు ఆళ్ల నాని  ఇచ్చిన పిలుపుమేరకు నగరపాలకసంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు బుధవారం సాయంత్రం స్థానిక 50వ డివిజన్ ఆళ్ల నాని కాలనీలో డిప్యూటీ కమిషనర్ సచివాలయ సెక్రటరీలు వాలంటీర్లు తో కలిసి గడపగడపకు తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఎక్కువసార్లు ట్రిప్ అవుతుందని, అక్కడ ఇంకొక ట్రాన్స్ఫర్ కావాలని కోరారు. లో వోల్టేజీ సమస్య పరిష్కరిస్తామని ఆయన అక్కడికి మహిళలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎన్.రాధ, 49వ డివిజన్ కార్పొరేటర్  దేవరకొండ శ్రీనివాసరావు, సచివాలయ సెక్రెటరీలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author