NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మండలానికి చేరుకున్న జగనన్న విద్యా కానుక కిట్లు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: జగనన్న విద్యా కానుక కిట్లు ఆదివారం మండల కేంద్రానికి చేరినట్లు ఎంఈఓ వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల్లోని 55 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు మంజూరైనట్లు చెప్పారు. కిట్లను స్థానిక ఎమ్మార్సీ భవనంలో భద్ర పరిచినట్లు తెలిపారు. జగనన్న విద్యా కానుకలో యూనిఫాం, స్కూల్ బ్యాగు, నోట్ పుస్తకాలు, షూస్, రెండు జతల సాక్సులు, బెల్ట్, డిక్షనరీ ఉంటాయని తెలిపారు. మొదటి విడతగా 11,880 మంది విద్యార్థులకు యూనిఫారాలు వచ్చాయని చెప్పారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునః ప్రారంభించిన మొదటి రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తామ న్నారు. కార్యక్రమంలో సీఆర్పీలు రవి, పుల్లన్న, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

About Author