PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగువెబ్ వెల్దుర్తి : మండలంలో, సచివాలయం-3 పరిధిలోని ఈరోజు సురక్ష వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ , ప్రారంభించి మాట్లాడారు.ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రులను నాడు-నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడమే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ సేవలను అందిస్తున్నారన్నారు. సీఎం జగనన్న చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారన్నారు. రోగులకు అందిస్తున్న సేవలను స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మరియు  మండల కన్వీనర్ రవి రెడ్డి, జెడ్పీటీసీ సుంకన్న మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author