PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ్మపాలెం గ్రామంలో జగనన్న కంటి వెలుగు కార్యక్రమం..

1 min read

వృద్ధులకు కళ్ళద్దాలు పంపిణీ చేసిన తాసిల్దార్ నల్లమిల్లి నాగరాజు

అద్భుత ఫలితాలిచ్చిందన్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామం లో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం లో జగనన్న కంటి వెలుగు లో వృద్దులకు కళ్ళద్దాలు పెదవేగి తహసీల్దార్ నల్లమెల్లి నాగరాజు స్వయంగా అందజేశారు.ఈ కార్యక్రమం లో  ఈ ఓ అండ్ పి ఆర్ డి శ్రీనివాసులు. ఎం ఈ ఓ అరుణ్ కుమార్. సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో అద్భుత స్పందననిచ్చిందని, నిపుణులైన డాక్టర్లచే పరీక్షలు చేసి  మండలాల్లో అన్ని వర్గాల ప్రజలకు డాక్టర్లు సహకరిస్తున్నారన్నారు. అధికారులు కూడా ఓర్పు సహనంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About Author