PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ఆరోగ్య సురక్ష సేవలు పేదలందరికీ అందాలి..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా వైద్య మరియు  ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ బి రామగిడ్డయ్య  ఉలిందకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కొంగనపాడు  గ్రామంలో జరుగుచున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపునకు అటెండ్ అయ్యారు అక్కడికి వచ్చిన పేషెంట్లు అందరినీ పరామర్శించి వైద్య సేవలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. పేషంట్లందరికీ పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు అన్ని అందుతున్నాయా లేదా అని చూశారు ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ కూడా ఈ ఆరోగ్య సేవలు అందాలని వైద్యాధికారులకు తెలిపారు మరియు ఆశ ఏఎన్ఎం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి ఇంటిలో వారిని మెడికల్ క్యాంపు నాకు తీసుకురావాలని తెలిపారు మరి అన్ని జాతీయ ప్రోగ్రామ్స్ అన్నియు 100% పూర్తయ్యే విధంగా చూసుకోవాలని తెలిపారు ఈ ప్రోగ్రాం లో వైద్యులు వైద్య సిబ్బంది ఎమ్మెల్యే హెచ్ పి ఏఎన్ఎం ఆశ తదితరులు పాల్గొన్నారు.

About Author