NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగనన్న సురక్ష కార్యక్రమానికి గ్రామాలలో ఆదరణ ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మంచాలకట్ట గ్రామం లో బుధవారం నిర్వహించిన  జగనన్న ఆరోగ్య సురక్షా కార్య క్రమానికి మంచి స్పందన లభించించి. ప్రభుత్వ వైద్యుడు  మద్దిలేటి  వైద్యురాలు ముల్లా జబీన్ ఆధ్వర్యంలో దాదాపు 550 మంది గ్రామస్తులు తమ అనారోగ్య సమస్యలకు వైద్యం చేయించుకున్నారు  ఇప్పటి వరకు  మండలం లో జరిగిన క్యాంపు ల రికార్డ్ లను బడ్డలుగొట్టింది. ఉదయం 9 గంటల ప్రాంతానికే ఓ పి 550 కి చేరి వైద్య.శిబిరమంతా రోగులతో కిట కిట లాడింది.వైద్య సిబ్బందితో బాటు ఈ కార్య క్రమ కో ఆర్డినేటర్లు ఎంపీడీవో మల్లీశ్వరప్ప.  శిబిరానికి వచ్చిన వృద్ధులకు స్వయంగా సేవలందించారు. గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో గుండె. ఊపిరితిత్తులు జబ్బులు మహిళలకు సంబంధించిన. గైనిక్ సమస్యలు ఉదర కోశ వ్యాధులు చెవి, ముక్కు గొంతు, ఎముకలు. నరాలు.మెదడు.పక్షవాతం. వంటి జబ్బులకు.మధుమేహం.ఎలర్జీ.వంటి వ్యాధులతో బాటు కంటి చూపు తో బాటు సాధారణ వ్యాధులకు కూడా పరీక్షలు చేసి ఉచితంగా  మందులు పంపిణీ చేసినట్టు ప్రభుత్వ వైద్యుడు మద్దిలేటి తెలిపారు ఈ కార్యక్రమంలో. సర్పంచ్ మూసాని వెంకటరమణ. స్థానిక వైసీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి .వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author