NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ జగనే రావాలి

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే పథకాలు కొనసాగుతాయని అందుకు గాను ప్రతి కార్యకర్త కష్టపడాలని అప్పుడే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా అవుతారని మిడుతూరు మండల జడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం పల్లెకు పోదాం అనే కార్యక్రమం గ్రామ సర్పంచ్ పెద్దిరెడ్డి కృష్ణవేణమ్మ అధ్యక్షతన జరిగినది.ఈ సందర్భంగా ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకువచ్చిందని గత టీడీపీ ప్రభుత్వం పనులు చేయకుండానే టిడిపి నాయకులు నిధులను మింగేశారని ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ప్రతి ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించిందని రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్తూ ఉంటే ఉంటే ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ వాళ్లు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వారు అన్నారు. తదనంతరం గ్రామంలో జెండాను నాయకులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ తులసి రెడ్డి,వైస్ ఎంపీపీ టి.నబి రసూల్,జెసిఎస్ మండల కన్వీనర్ రవికుమార్,పీరు సాహెబ్ పేట సీనియర్ నాయకులు కైపా శ్రీధర్ రెడ్డి,రోళ్లపాడు సర్పంచ్ వెంకటరామిరెడ్డి,మాజీ సర్పంచ్ రామస్వామి రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు పెద్దమౌలా,గ్రామ నాయకులు పెద్దిరెడ్డి చిన్న రామచంద్రా రెడ్డి,  రామలింగేశ్వర రెడ్డి,సిరిగిరి పుల్లయ్య,పంచాయితీ కార్యదర్శి ఎన్.అనురాధ మరియు ప్రజలు పాల్గొన్నారు.

About Author