PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్నే మా భవిష్యత్ ..మా నమ్మకం నువ్వే జగనన్న

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు ముఖ్య నాయకుల సమావేశాన్ని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నంద్యాల జిల్లా అబ్జర్వర్ ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ,జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్ర బోతుల పాపిరెడ్డి గారు,ఆంద్ర ప్రదేశ్ ఇరిగేషన్ అభివృద్ది కార్పొరేషన్ ఛైర్మన్ కర్రా గిరిజా రెడ్డి , చల్లా విజ్ఞేశ్వర్ రెడ్డి ,అవుకు జిల్లా పరిషత్ మెంబర్ చల్లా శ్రీ లక్ష్మీ లతో పాటు వైఎస్సార్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు . అనంతరం మా నమ్మకం నువ్వే జగనన్నఅనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆద్వర్యం లో బనగానపల్లె పట్టణం లోని ముత్తు మియ్యా స్ట్రీట్ లో ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవడమే కాకుండ జగనన్న ప్రభుత్వం లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పని తీరు ఎలా వుంది ,వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎలా పథకాలు అందుతున్నాయి అంటూ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వయంగా ప్రజల నుంచి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్నిబనగానపల్లెపట్టణంముత్తుమియ్యా కాలనీ నందు ప్రారంబించడం జరిగింది అని చెప్పారు. ఇంటింటికీ వెళ్ళి జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి అంటూ ప్రజల నుంచే స్వయంగా అడిగితెలుసుకోవడం జరిగింది . ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పని తీరు బాగా వుందని సంతృప్తి వ్యక్తం చేశారు . అలాగే మురికి కాలువలు కొత్తగా నిర్మించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దృష్టికి ప్రజలు తీసుకువెళ్లడం తో వెంటనే అధికారులకు ప్రతి పాదనలు తయారు చేయాలని ఆదేశించారు .

About Author