PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్న ఎంతో అవసరం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో అవసరమని జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో పల్లెకు పోదాం అనే కార్యక్రమం మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ నాగ స్వామి రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఉపయోగపరమైన పనులు ఈ ప్రభుత్వంలో జరిగాయని అంతేకాకుండా చరిత్రలో ఎన్నడూ ఎరుగని విప్లవాత్మక పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారని జెడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,సహకార సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి అన్నారు.రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకి ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని నాయకులు అన్నారు.మా నమ్మకం నువ్వే జగనన్న పథకాల నగదు వివరాల బోర్డును నాయకులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ టి. నబి రసూల్,జెసిఎస్ మండల కన్వీనర్ బి.రవికుమార్,మాజీ ఏఎంసీ చైర్మన్ చిన్నమల్లారెడ్డి,సర్పంచ్ ఫణి భూషణ్ రెడ్డి,ఎంపీడీఓ జిఎన్ ఎస్ రెడ్డి,మల్లు శివ నాగిరెడ్డి, మహబూబ్ బాష,పుల్లయ్య,గోపాల్ రెడ్డి, పంచాయితీ కార్యదర్శి ఫరీద్ అహ్మద్ మరియు ప్రజలు పాల్గొన్నారు.

About Author