NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగనన్నను మరోసారి ఆశీర్వదించండి..

1 min read

సంక్షేమం..అభివృద్ధే.. లక్ష్యం

  • ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​
  • 24వ వార్డులో గడప గడపకు.. విశేష స్పందన
  • కర్నూలు, పల్లెవెలుగు: నగరంలోని 24వ వార్డు పరిధిలో మంగళవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​కు కాలనీవాసులు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అమలు చేస్తున్నారరన్నారు  రాజకీయాలకు అతీతంగా బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం వైసిపి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మన ప్రభుత్వానికి జగనన్నని ఆశీర్వదించాలని కోరారు. జగనన్న పరిపాలనలోనే సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అన్నారు. వీధిలో ఉన్న డ్రైనేజీ, మురికి కాలువల సమస్యను ఎమ్మెల్యే   దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సనుకూలంగా స్పందించి సమస్యలను తీర్చేందుకు మున్సిపాలిటీ సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు వార్డ్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ అసిఫ్ గారు, డిష్ రాజు గారు,అనీస్ ఖాన్ గారు,ఆల్బట్ అబ్బాస్ అలీ గారు, సుచరిత గారు, సునీల్ గారు, అర్చన్ గారు, కిషోర్ గారు, సచివాలయం సిబ్బంది, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author