PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు జగన్నన్న కు తెలుసు

1 min read

– ఎస్ వి మోహన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారు నగరం లొని 1 వ వార్డ్ మరియు 2 వ వార్డ్ వైస్సార్సీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ను నిర్వహించారు . ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి శ్రీ వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి గారు అట్టడుగు వర్గాల వారికీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టా రు అని వాటిని దేశం లొని అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి అని తెలిపారు. కార్యకర్తలు ప్రతి ఒకరు జగన్నన్న సైని కుల వలె పోరాడాలి అని తెలిపారు. కార్యకర్తలు ఎప్పుడుఏ కష్టం వచ్చిన తనను ఎప్పుడు అయిన సంప్రదించ వచ్చు అని తెలిపారు. కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు జగన్నన్న కు తెలుసు అని  తెలిపారు.  పార్టీ ని బలోపి తం చేయడానికి తాను త్వరలో నే వార్డ్ లలో పర్యటిస్తాను అని, జగన్నన్న  ఆశయాల అమలు కు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలనీ పిలుపు నిచ్చారు. కార్యక్రమం 1 2 వార్డ్ లకు చెందిన ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author