PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వర్ణయుగంగా జగనన్న పాలన…

1 min read

హామీలు నెరవేర్చడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న జగనన్న.

ప్రభుత్వ పాలనకు వందశాతం మార్కులు.

ప్రభుత్వ పథకాలును వివరిస్తూ,

సమస్యలుపై ఆరా తీస్తూ..ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.

నెహ్రూ నగర్ గ్రామంలో మూడవ రోజు  నిర్వహించిన  గడప కు మన ప్రభుత్వం కార్యక్రమానికి జన నీరాజనం.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అభివృద్ధి, సంక్షేమంలతో రాష్ట్రంలో  స్వర్ణయుగంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పేర్కొన్నారు. గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామ పంచాయతీ లోని పాత కొండ ప్రాగటూర్  గ్రామంలో  ఎమ్మెల్యే ఆర్థర్  ఇల్లు ఇల్లు తిరిగి పథకాల అమలును వివరిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ  ప్రజలతో మమేకమయ్యారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ,అభివృద్ధి పథకాలను వివరిస్తూ, అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందనివారికి  పథకాలు అందేలా అధికారులును ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్  మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నా రన్నారు.వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ పాలనకు ప్రజలు వంద శాతం మార్కులు వేస్తున్నారన్నారు.

వాడ వాడల్లో ఇంటింటా ఆత్మీయ స్వాగతాలు..

గ్రామంలోని వాడ  వాడలలో ఎంఎల్ఏ ఆర్థర్ కు ఇంటింటా అపూర్వ స్వాగతాలు లభించాయి.కుల మతాలకు అతీతంగా మహిళలు, ఆత్మీయంగా తమ ఇళ్ల వద్దకు ఆహ్వానించారు.జగనన్న పాలనలో తమకు నేరుగా ఎవ్వరి సిపారసు లేకుండానే  సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దళితుల సంక్షేమం ,అభివృద్ధికి జగనన్న చిత్తశుద్ధితో కృషి చేస్తూ దళితుల పక్షపాతిగా పేరొందారని ఎమ్మెల్యే ఎదుట హర్షం వ్యక్తం చేశారు. 

నవరత్నాల పథకాలతో  గడప గడపనా సంతృప్తి..సచివాలయ పరిధిలోని ప్రతి వాడల్లో  అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా,  చేయూత,  తదితర పథకాలు  ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు లబ్ది అందడం పై  ప్రజలు సంతోషం వ్యక్తం చేసి, సీఎం జగన్, ఎంఎల్ఏ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని సంక్షేమ పథకాలను ఏ ప్రభుత్వంలో చూడలేదని  ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్  గంగిరెడ్డి రమాదేవి, జిల్లా యస్.సి విభాగం అధ్యక్షులు  సగినేల. వెంకట రమణ , వైసీపీ నాయకులు  విజయుడు, శ్రీనాథరెడ్డి, ధర్మేంద్ర నాయుడు, శ్రీనివాస గౌడ్, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పై పాలెం ఇనాయతుల్లా , వైసీపీ నాయకులు  నందికొట్కూరు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు  చందమాల బాలస్వామి , తమ్మడపల్లి విక్టర్, విశ్రాంత పోలీసు అధికారి  పెరుమాల్ల జాన్ , బూశి గౌడ్, ఉదయ్ కిరణ్ రెడ్డి, మండల తహసిల్దార్  భారతి , అభివృద్ధి అధికారి  వెంకటరమణ , వివిధ  ప్రభుత్వ శాఖల అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

About Author