PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న్ ఏ రంగు చీర క‌ట్టుకోవాలో చెప్పాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అభంశుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నా.. తాడేపల్లి కొంపదాటి బయటకురాలేని సీఎం జగన్, వైసీపీ నేతలు మహిళాసాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి రోజాను ఉద్దేశించి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఒక అనూష, రమ్య, తేజస్విని, వరలక్ష్మి, నాగమ్మ, ఈరోజు తెనాలి.. ఇలా వివాహితలు బలవ్వడానికి ముఖ్యమంత్రి జగన్ కారణం కాదా? అని ప్రశ్నించారు. లోకేశ్ గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటున్నారని, ముఖ్యమంత్రిలా ఇల్లు దాటి బయటకురాకుండా, పోలీస్ పహారా లేకుండా బయటకురాలేని దుస్థితిలో లేరని అన్నారు. లోకేశ్ ఓడిపోయారంటున్న రోజా ఓడిపోలేదా? అని ప్రశ్నించారు. తల్లిని విశాఖపట్నంలో గెలిపించుకోలేని జగన్ ఏరంగు చీరకట్టుకోవాలో రోజా చెప్పాలన్నారు.

                                              

About Author