PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న్ గ్యాంగ్ విధ్వంసానికి పాల్ప‌డుతోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జగన్, అతని గ్యాంగ్ పర్యావరణ విధ్యంసానికి పాల్పడుతోందని ఆరోపించారు. చెట్లని నరికేస్తే పెంచొచ్చు.. కాని కొండల్ని తవ్వేస్తే ఎలా? అని సీఎంను ప్రశ్నించారు. ‘‘చారిత్రాత్మక విశాఖ రుషికొండను కనుమరుగు చేయటం బరితెగింపే. పర్యావరణ విధ్వంసానికి జగన్‌కు అధికారం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 శాతం అడవుల్ని నాశనం చేశారు. ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వ్యక్తులు ముఖ్యం కాదు. సమాజమే శాశ్వతం. రవ్వల కొండను తవ్వేశారు. భారతీ సిమెంట్స్ కోసం బమిడికలొద్దిలో లాటరైట్, బాక్సైట్ తవ్వకాలు జరిపారు. కుప్పంలో జరిగే మైనింగ్ ప్రాంతానికి ఎవరినీ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. కొండల్ని అక్రమంగా తవ్వేస్తున్న వారందర్ని బోనెక్కిస్తాం.“ అని హెచ్చ‌రించారు.

                                             

About Author