PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ పాలన- అభివృద్ధికి బాటలు

1 min read

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  జగన్ పాలన రాష్ట్ర అభివృద్ధి కి బాటలు అని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. ఆదివారం   మండల పరిధిలోని వగరూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనం ను ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా యువజన నాయకులు ప్రదీప్ రెడ్డి తో కలిసి హాజరయ్యారు. వీరికి గ్రామ పెద్ద వీరారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, గ్రామ సర్పంచు కురువ లింగారెడ్డి, ఎంపిటిసి సభ్యులు, డీలర్ ఈర్నాగప్ప లు గజ మాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయిన ఈ నాలుగేళ్ల లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు జి. భీంరెడ్డి,   దశరథరెడ్డి, ఎస్ఐ వేణు గోపాల్ రాజ్, పీఆర్ డిఈ అశ్వ ధామ, ఏఈ నర్సింహులు, గ్రామ నాయకులు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

About Author