PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్కార్ బ‌రిలో `జై భీమ్` !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ న‌టుడు సూర్య హీరోగా న‌టించిన చిత్రం జైభీమ్. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు అందుకుని సూప‌ర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది ఆయన నటించిన ‘జై భీమ్‌’ చిత్రం 94వ ఆస్కార్‌ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాలో చోటుదక్కించుకుంది. ఈ ఏడాది మొత్తం ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కోసం 276 చిత్రాలు ఎంపిక చేయగా, వీటిలో మన దేశం నుంచి రెండు చిత్రాలు ఎంపికయ్యాయి. వీటిలో ఒకటి ‘జై భీమ్‌’. మరొకటి మలయాళ చిత్రం ‘మరక్కర్‌’ . ‘జై భీమ్‌’ చిత్రం బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో అవకాశం దక్కించుకుంది. 1993లో తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనలు, మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కింది.

                                 

About Author