PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జై భీమ్​..పార్వతమ్మకు ఇంటిని నిర్మించి ఇస్తా !

1 min read

పల్లెవెలుగు వెబ్ :చేయ‌ని నేరానికి చిత్రహింస‌కు గురైన రాజ‌క‌న్ను కుటుంబాన్ని తాను ఆదుకుంటాన‌ని ద‌ర్శకుడు లారెన్స్ ప్రక‌టించారు. రాజ‌క‌న్ను భార్య పార్వత‌మ్మకు ఇళ్లు క‌ట్టించి ఇస్తాన‌ని తెలిపారు. 28 ఏళ్ల క్రితం జ‌రిగిన వాస్తవిక ఘ‌ట‌న ఆధారంగా జై భీమ్ చిత్రం నిర్మించారు. పార్వత‌మ్మ పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోయాన‌ని, ద‌ర్శకుడు జ్ఞాన్ వేల్ అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని లారెన్స్ అన్నారు. ఆయ‌న్ను మ‌న‌సారా అభినందిస్తున్నానని తెలిపారు. పార్వత‌మ్మకు త‌ప్పకుండా మంచి ఇంటిని నిర్మించి ఇస్తాన‌ని అన్నారు. 28 ఏళ్ల క్రితం జ‌రిగిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చనీయాంశం అయింద‌ని అన్నారు.

About Author