PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జై జన సంఘం పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. 

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: మన హక్కులు కాపాడాలంటే మన చేతిలో ఉన్న ఆయుధంమే మన ఓటు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఈ ప్రభుత్వంలో ఎం తోఇబ్బంది పడుతున్నారని జై జన సంఘంపార్టీ అధినేత రేలంగి నాగేశ్వరరావు  అన్నారు. స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారంజరిగిన    జై జన సంఘం నూతన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  ..పార్టీ అధినేత రేలంగి నాగేశ్వరరావు, మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోవెనుక బడి ఉందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు గవర్నమెంట్ లో ఎంతొ ఇబ్బంది పడుతున్నారని, నేను కూలి పని చేసి వచ్చిన వాడిని ఇప్పుడు ఎంతొ మందికి ఉపాధి కల్పిస్తున్నారని నా ఉద్యమ స్ఫూర్తి చూసి పవన్ కళ్యాణ్ నన్ను  ఫిలిపించి మొన్న జరిగిన ఎలక్షన్లలో పోటి చేయించారని నేను జనసేన పార్టీకి నాకు నేనుగా వచ్చానని పవన్ కళ్యాణ్ మంచి నాయకులని ఈ ప్రభుత్వంలో డబ్బు ఉన్నవాడే నాయకుడని ఎస్సీ ఎస్టీ కులాలవారిని ఓటు బ్యాంకింగ్ గా వాడుకొని వదిలేస్తున్నారని , నా జీవితం ప్రజలకు అంకితం చేయాలని అంబేద్కర్ ఆశయాలు కాపాడాలని ,ఈ పార్టీ పెట్టడం జరిగిందని, మా హక్కులు కాపాడాలంటే మన చేతిలో ఉన్న ఆయుధం మన ఓటు అని ఈ ప్రభుత్వం సెంటు భూమి ఇచ్చి సెంటిలో ఇల్లు కట్టకపోతే మళ్ళీ తిరిగి తీసుకుంటామని అంటున్నారని, ప్రజల భయంతో అప్పులు తెచ్చి ప్రజలు అప్పుల పాలవుతున్నారని, కాపాడుకుంటాం అంబేద్కర్  ఆశయాలతో ముందుకు వెళ్తాం అన్నారు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ,బిసి నిధులు, ఏమయ్యాయి చెప్పాలని , ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు ఇప్పటికైనా మా జై జన సంఘం పార్టీకి మద్దతు ఇవ్వాలని  .   కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన పార్టీ నాయకులు రాగుల రాఘవులు, కొండ సురేష్, కేతా సత్తిబాబు, మేడిశెట్టి భీమార్జున బీసీ సంఘం నాయకులు మేడిశెట్టి సత్యనారాయణ నెకూరి అబ్రహం తదితరులు పాల్గొన్నారు .

About Author