PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జైల్ భరో !

1 min read

పల్లెవెలుగువెబ్ : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో కార్మికులు జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టారు. కూర్మన్నపాలెం ఆర్చి వద్ద నుంచి గాజువాక వరకు ర్యాలీ నిర్వహించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని పోరాట సమితి నాయకులు స్పష్టం చేశారు. కార్మికుల నిరసన పాల్గొన్న సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి వారికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం గాజువాక చేరుకున్న కార్మికులు పీఎస్ వద్ద బైఠాయించి ఆందోళన తెలిపారు. ఫలితంగా జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో కార్మికుల్ని అరెస్టు చేసి గాజువాక స్టేషన్ కు తరలించారు.

          

About Author