PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దర్గాలో చాదర్‌ను సమర్పిస్తున్న జమీల్‌ అహ్మద్‌ బేగ్‌

1 min read

– దేశ, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలి
– ఎన్‌సిపి మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌
పల్లెవెలుగు వెబ్ గుంటూరు: స్థానిక శ్రీ హజరత్‌ కాలేమస్తాన్‌ షావలి దర్గాలో బుధవారం నుంచి 131వ ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఐదు రోజులపాటు జరుగనున్నాయి. కుల, మత బేధము లేకుండా హిందూ, ముస్లింలు సోదరభావంతో కలసిమెలసి ఒకటై జరుపుకుంటున్న మహోత్సవాలకు వివిధ ప్రాంతాలనుంచి ముస్లింలు విచ్చేసి బాబా వారికి శేష వస్త్రములను (ఛాదర్‌) చందనమును సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎన్‌సిపి మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల మైనార్టీ విభాగాల అబ్జర్వర్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ దర్గాను సందర్శించి, చాదర్‌ను సమర్పించారు. దేశ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో జీవించేలా ఆశీస్సులివ్వాలని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం తరఫున కోరు కున్నట్లు జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ తెలిపారు.

About Author