NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాంగ్రెస్‌ విజయంపై  జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ హర్షం

1 min read

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : కర్నాటకలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు బుద్ధిచెప్పారని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ అన్నారు. మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన బలాన్ని అందించి ప్రజా వ్యతిరేక బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీపై వ్యతిరేకత వ్యక్తమైందని, దీంతో నిరంకుశ బీజేపీ పాలనకు పతనం ప్రారంభమైందని, అలాగే రాబోయే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇదే రకమైన బీజేపీ వ్యతిరేక తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ విజయంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున్‌ ఖార్గే, కర్నాటక పీసీసీ చైర్మన్‌ శివకుమార్‌లకు అభినందనలు తెలుపుతూ  మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన కర్నాటక ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అందజేశారు. ఏపీలో బీజేపీతో పొత్తుకు ఉవ్విళ్ళూరుతున్న పార్టీలకూ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ అన్నారు.

About Author