NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన జంపాన శ్రీనివాస్ గౌడ్

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: సబ్ కలెక్టర్ తోట్లవల్లూరు తాసిల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసినట్లుగా రుజువైనందున యాకమూరు పూర్వపు వీఆర్వో బొప్పన గోపాలకృష్ణ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి .ఆరు నెలల క్రితమే జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించిన ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ,స్పందనలో కృష్ణాజిల్లా కలెక్టర్ కు రంజిత్ భాషా కు సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ వినతి .కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామం పూర్వపు గ్రామ పరిపాలనాధికారి బొప్పన గోపాలకృష్ణ విజయవాడ ఆర్డిఓ తోట్లవల్లూరు తాసిల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేసినట్లు ఎస్సీ సొసైటీ (ఎంక్వైరీ ఆఫీసర్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. చంద్ర లీల తన విచారణ నివేదికలో రుజువైనట్లు, పేర్కొంటూ గ్రామ పరిపాలన అధికారి బొప్పన గోపాలకృష్ణ పై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సెప్టెంబర్ 22 తేదీ 2022న జిల్లా కలెక్టర్ కి తదుపరి నివేదిక సమర్పించినందున తగు చర్యలు తీసుకోగలరని, కృష్ణా జిల్లా స్పందనలో విన్నవించడం జరిగిందని ,సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author