PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్య‌క‌ర్త కుటుంబానికి జ‌న‌సేన రూ. 5 ల‌క్ష‌ల సాయం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జ‌న‌సేన క్రియాశీల స‌భ్యుల‌కు ఆ పార్టీ బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఇటీవ‌లే రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీల స‌భ్యుడు పిన్న‌మ‌నేని వీర నాగాంజ‌నేయులు కుటుంబానికి ఆ పార్టీ రూ.5 ల‌క్ష‌ల బీమా ప‌రిహారాన్ని అంద‌జేసింది. ఈ మేర‌కు కృష్ణా జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం గూడూరు మండ‌లం క‌త్తుల‌వారిపాలెం వెళ్లిన జ‌న‌సేన పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌… బాధిత కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల బీమా ప‌రిహారం చెక్కును అంద‌జేశారు. బాధిత కుటుంబాన్ని ఆయ‌న ఓదార్చారు.

                                     

About Author