NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌వాద్ తుఫాన్.. అతి భారీ వ‌ర్షాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ :భార‌త వాతావ‌ర‌ణ శాఖ తుఫాను హెచ్చరిక‌లు జారీ చేసింది. దేశంలోని మూడు రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉంటుంద‌ని తెలిపింది. జవాద్ తుపాన్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 4వ తేదీన తుఫాన్ ప్రభావం వల్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, దీనివల్ల పంటలకు భారీ నష్టం కలిగించవచ్చని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. రైతులు పొలాల్లో ఉన్న మొక్కజొన్నను కోయాలని బెంగాల్ సర్కారు సూచించింది.

About Author