PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జయహో బిసి కార్యక్రమం విజయవంతం

1 min read

ఆలూరు నియోజకవర్గం ప్రజలందరికీ అభినందనలు…  టీడీపీ నాయకులు…

పల్లెవెలుగు వెబ్  హోలగుంద:  నిన్న, ఆలూరు నియోజకవర్గం  హోలగుంద మండల పరిధిలోని వందవగిలి గ్రామం లో జయహో బిసి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ఆలూరు తాలూకా నాయకులకు మరియు ప్రజలకు అభినందనలు, ప్రజలు ఇప్పటికీ కూడా తెలుగుదేశం వైపే ఉన్నారన్నదానికి ఈ సభ నిదర్శనం ఆని తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ బీసీల తెలుగుదేశం పార్టీకి వెన్నెముకని చాటిచెప్పిన ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు మన ఆలూరు తాలూకాలో ఆలూరు తాలూకా ఇన్చార్జ్ అయినటువంటి కోట్ల సుజాతమ్మ వెంటే ప్రజలు ఉన్నారని ఈ సభ ద్వారా సుజాతమ్మ గెలుపు నల్లేరు పై నడకని తెలియజేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ dr తిప్పయ్య  ,సర్పంచ్ సుధాకర్ , రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఆదమ్,  మాజీ జెడ్పిటిసి రామలింగారెడ్డి , మాజీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి , క్లస్టర్ ఇంచార్జ్ వీరేంద్ర ,ఐటీడీపీ తాలూకా కార్యదర్శి హనుమంతు , మండల యూత్ నాయకులు మంజునాథ్ గౌడ్, తిక్క స్వామి , వీరన్న తదితరులు పాల్గొని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపడం జరిగింది.

About Author