NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

16న బ్రహ్మం గారి జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: ఈనెల 16న జరిగే బ్రహ్మం గారి జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం తాలూకా అధ్యక్షుడు శంకరయ్య ఆచారి పిలుపునిచ్చారు. శనివారం పత్తికొండ పబ్లిక్ రీడింగ్ రూమ్ ఆవరణంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత పేట లోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరిగే జయంతి ఉత్సవాలను విశ్వబ్రాహ్మణులు జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కృష్ణయ్య ఆచారి, పరమేశ్ ఆచారి, బ్రహ్మచారి ఆచారి, వీర నాగరాజు ఆచారి, ప్రభాకర్, రాజు పాల్గొన్నారు.

About Author