PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎండియు వాహనం ద్వారా రేషన్ పంపిణీని పరిశీలించిన జేసి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల  : మండలంలోని( కొర్రపోలూరు) గ్రామంలో ఎండియు వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న ప్రక్రియను శుక్రవారం నాడు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులతో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. ఇంటి దగ్గరికే వాహనము వచ్చి రేషన్ ఇస్తుందా అని అడిగి తెలుసుకున్నారు. ఇవ్వాల్సిన పరిమాణం ఇస్తున్నారా లేదా తక్కువ పరిమాణం ఇస్తున్నారా అని ఆరా తీశారు. రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డ్యూటీ ప్రసాదరావు, తహసిల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ తాసిల్దార్ గుర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

About Author