NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులపై దాడి దారుణం: జే.సీ ప్రభాకర్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్: ఎయిడెడ్ కాలేజీల అంశంపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. అనంతపురంలో నిరసన తెలియజేస్తున్న విద్యార్థులను పోలీసులు కొట్టడం దారుణమని.. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనమయ్యేలా నాయకులు వ్యవహరించకూడని హితవు పలికారు. ఒక్కో ప్రభుత్వం తనకు నచ్చినట్లు నిబంధనలు తెస్తుంటే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి అని ప్రశ్నించారు. విద్యార్థులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదని..వారిపై దాడి చేయడం పోలీసులకు తగునా అని జేసీ ప్రశ్నించారు.

About Author