PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారులను అడ్డుకున్న జడ్పిటిసి

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  తెలుగు గంగ అధికారులను మహానంది మండల జడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి సోమవారం సాయంత్రం అడ్డుకున్నట్లు బొలవరం గ్రామ రైతుల పేర్కొన్నారు. తెలుగు గంగ ప్రధాన కాలువ నుండి పదవ బ్లాక్ ద్వారా అక్రమంగా జడ్పిటిసి ఆధ్వర్యంలో నీటిని తరలిస్తున్నారని రైతుల ఫిర్యాదు మేరకు తెలుగు గంగా అధికారులు సర్వే నిమిత్తం వచ్చి రైతుల సమక్షంలో మార్కింగ్ వేసి ఇది అందరూ పాటించాలని అధికారులు సూచించారు. దీని ప్రకారం నీటి నీ రైతులు వినియోగించుకోవాల్సి ఉంటుందని అక్కడున్నవారికి చూసినట్లు రైతులు తెలిపారు ఇది మింగుడు పడని జడ్పిటిసి దీంతో మీకు ఏమీ తెలియదని తెలియకుండా మాట్లాడవద్దని రైతుల ఎదుట అధికారులను హెచ్చరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చెప్పినది వినకుండా నేను చెప్పిందే వినాలని తన అనుచరుల సమక్షంలో హెచ్చరించడంతోపాటు లేదంటే మీ ఇష్టం అడ్డుగోడ కడతారా కట్టుకోండి తర్వాత చూసుకుంటా అంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల మాటలు లెక్కచేయకుండా మాట్లాడుతుండడంతో అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధి పై ఫోటో మరియు వీడియోలు తీస్తారా అని మీకు ఎంత ధైర్యం అని జడ్పిటిసి సోదరుడు పలు ఆరోపణలతో పాటు రైతుల సమక్షంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మరియు దాడికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. అడ్డు కట్టడం తొలగించి అక్రమంగా నీటిని తరలింపుకు సహాయ సహకారాలు అందిస్తున్న జడ్పిటిసి మరియు అనుచరులపై కేసు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు. తెలుగు గంగా అధికారులను కూడా లెక్కచేయకుండా అంతా నా ఇష్టం నేను చెప్పిందే వేదం నేను చేసిందే శాసనం అనే విధంగా వ్యవహరించడం పై ఉన్నత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామాల మధ్య నీటి వివాదం చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూడడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు .

About Author