NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జె.ఈ.ఈ. మెయిన్స్​లో..’ శ్రీచైతన్య’ ప్రభంజనం

1 min read

పల్లెవెలుగు: ఆలిండియా స్థాయిలో జరిగిన జెఈఈ మెయిన్స్​ పరీక్ష ఫలితాల్లో కర్నూలు శ్రీ చైతన్య విద్యా సంస్థలు విజయకేతనం  ఎగరవేసింది. ఉత్తమ ప్రతిభతో… అత్యుత్తమ ఫలితాలు సాధించి… శ్రీచైతన్య విద్యార్థులకు ఎవరూ సాటిలేరని మరోసారి నిరూపించింది. వివిధ కేటగిరిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థినీవిద్యార్థులను శుక్రవారం శ్రీ చైతన్య కళాశాల ఏజీఎం మురళీకృష్ణ,  డీన్​ సరళ అభినందించారు.   ఈ సందర్భంగా ఏజీఎం మురళీకృష్ణ విద్యార్థుల ర్యాంకులను వివరించారు. ఎన్​.కోమల్​ 750వ ర్యాంకు, ఎన్​. రాహిల్​ 1359, బి. జయసాయి1614, పి.జోయల్​ 3820, జె. అక్షయ రావు 5790, పి. కేదార్​నాథ్​ 5720, సి. సురేంద్ర 5790 ర్యాంకు సాధించారు.  127 మంది విద్యార్థులు జెఈఈ మెయిన్స్​ అడ్వాన్స్​కు అర్హత సాధించారని, అందరూ కర్నూలు శ్రీ చైతన్య కళాశాలకు చెందిన వారు కావడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. అంతేకాక రాబోయే నీట్​ మరియు అడ్వాన్స్​డ్​ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించగరలని ఈ సందర్భంగా ఏజీఎం మురళీ కృష్ణ వెల్లడించారు.

About Author