PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

9 లక్షల 80 వేలకు వేలం పాటను దక్కించుకున్న జింకల అంజి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: మండల కేంద్రంమైన ప్యాపిలి లో వారపు సాంత మార్కెట్, దిన కూరగాయల మార్కెట్, బస్టాండ్, మాంసం మార్కెట్ వేలంపాటలు మేజర్ గ్రామపంచాయతీలో శనివారం ఇఓఆర్డీ బాలకృష్ణ, ఇఓ శివకుమార్ గౌడ్ అధ్యక్షత నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జడ్పిటిసి బోరెడ్డి శ్రీరామ రెడ్డి, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి ,మేజర్ గ్రామపంచాయతీ సర్పంచి లక్ష్మీదేవి, వైస్ ప్రెసిడెంట్ గడ్డం భూవనేశ్వర్ రెడ్డి హాజరై వారి సమైక్యంలో వేలంబాటను నిర్వహించారు. అందులో ప్యాపిలి పట్టణానికి పుట్ట రవికుమార్ ,సాయి సాకేత్ ,జింకల అంజి ,బోరెడ్డి రఘునాథరెడ్డి ,జి రామ్మోహన్, మురళి ,ఎన్. నాగేంద్ర ఏడు మంది వేలంపాటకు హాజరై 6లక్షల 38వేలతో మొదలైంది.ఈ వేలం పాటలో జింకల అంజి 9లక్షల 80వేలకు వేలం పాట దక్కించుకున్నారు. పోయినా సంవత్సరం 8లక్షల81వేలు వేలం పాడగా ప్రస్తుతం 9లక్షల 80వేలు వేలం పాట జరిగింది.మేజర్ గ్రామ పంచాయతీ కి 99వేల ఆదాయం వచ్చింది. ఈకార్యక్రమంలో వైసీపీ నాయకులు బోరెడ్డి క్రి ష్ణరెడ్డ ,బోరెడ్డి రాము ,తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author