NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేద విద్యార్థికి జిన్నా సెవా సంస్థ ధ్వారాఆర్థిక సాయం

1 min read

పల్లెవెలుగు,  అన్నమయ్య జిల్లా బ్యూరో:  ట్రిపుల్ ఐటీ కి ఎంపికైన అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలంలోని ఒధివీడుకు చెందిన పేద విద్యార్థి ని కి  జిన్నా సేవా సంస్థ సభ్యుడు జిన్నా షరీఫ్ రూ  10,000 లు ఆర్థిక సాయం అందించారు. శుక్రవారం వీరబల్లి మండలం ఓదివీడు  కస్పాకు చెందిన చింతమాని తిమ్మయ్య రెండవ కుమార్తె ఓదివీడు ఎర్రం రాజు గారి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి 556 మార్కులు సాధించింది ఈ విద్యార్థిని శ్రీకాకుళంలోని ఐ ఐ ఐటీ కి ఎంపికైంది అయితే కనీసం  అక్కడికి చేరేందుకు కూడా ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న జిన్నా  సేవా సంస్థ  సభ్యుడు జిన్నా షరీఫ్  వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సాయం అందించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని చదువు కోసం భవిష్యత్తులో తన వంతు సాయం అందిస్తానని చెప్పారు.

About Author