NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్ట్స్ అండ్​ సైన్స్ కళాశాల, ఆదోని లో 19 న ఉద్యోగ మేళా

1 min read

ఆదోని , న్యూస్​  నేడు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో   ఆదోని అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఆదోని నందు ఈ నెల 19.04.2025  వ తేదీన నిరుద్యోగ యువతీ ,యువకుల కొరకు ఉద్యోగ మేళా  నిర్వహించటం జరుగుతుంది.ఈ సందర్బంగా ఏం.యల్.ఏ వాల్మీకి పార్థసారథి  జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించి ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత మరియు పట్టణ ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది.ఈ ఉద్యోగ మేళాలో బహుళజాతీయ 13  కంపెనీల  ప్రతినిధులు పాల్గొనటం జరుగుతుంది.దీనికి జిల్లాలోని ఎఎస్​ఎస్​సి  ఇంటర్మీడియట్, డిగ్రీ , డిప్లొమా, బి.టెక్,ఎంబీఏ పూర్తీ చేసినవారు అర్హులు.. మరియు ఈ జాబ్ మేళ కి హాజరయ్యే అభ్యర్థులు 18 సంవత్సరాలనుండి 35 సంవత్సరాల  లోపు వయస్సు గలవారు అర్హులు. దీనికి ఫ్రెషర్స్ తో పాటుగా అనుభవం కలిగిన వారు కూడా అర్హులు.దీనిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 12,000 /- రూపాయల నుండి 24,000/- రూపాయల వరకు జీతం ఉంటుందని మరియు ఇతర ఆలవన్సెస్ వుంటాయని, కావున జిల్లాలోని అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని, వారు ఈ నెల 19 ( శనివారం ) వ తేదీన నేరుగా వారి , బయో డేటా , సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూ లకు ఆదోని అర్ట్స్ కళాశాల,  ఆదోని లో హాజరు కావాలని తెలియజేశారు. ఇతర వివరాలకు  9177413642, 9703993995 నంబర్లను సంప్రదించగలరు.శ్రీ.ఎల్. ఆనంద్ రాజ్‌కుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ.కర్నూలు జిల్లా..

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *