PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాబ్ మేళా భ‌గ్నం.. మంత్రి పెద్దిరెడ్డి పై నిరుద్యోగుల ఫైర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆర్‌సీవై మెగా జాబ్‌మేళాను పోలీసులు భగ్నం చేశారు. వందకుపైగా పరిశ్రమల ద్వారా దాదాపు పది వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ శనివారం ఈ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం రాత్రి నుంచే పోలీసులు మోహరించారు. జాబ్‌మేళా భగ్నం కావడంతో పుంగనూరు కోర్టు సమీపం నుంచి ఆర్సీవై టీం, యాదవసంఘ నాయకులు, జాబ్‌మేళాకు వచ్చిన నిరుద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ‘పెద్దిరెడ్డి డౌన్‌డౌన్‌, న్యాయం కావాలి, నిరుద్యోగుల కడుపుకొట్టకండ’ంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

                                                    

About Author