NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. వచ్చే నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్టు అందులో పేర్కొన్నారు. సమ్మె నోటీసును సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు అందజేశారు. సీఎస్ సమీర్ శర్మ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో జీఏడీ ముఖ్యకార్యదర్శికి నోటీసు అందించారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే వరకు సమ్మె కొనసాగుతుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.

       

About Author