NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు  రుణమాఫీ…2లక్షలు , యువకులకు ఉద్యోగాలు కాంగ్రెస్​తోనే సాధ్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : 2024 కాంగ్రెస్ మేనిఫెస్టోలో  9 గ్యారెంటీ ల పథకంలో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఆంధ్రప్రదేశ్ కు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా గ్యారెంటీ, పేదలకు ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు, రాష్ట్రంలో కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు యువకులకు అవకాశం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో అన్నారు. వృద్ధులకు వృతంతులకు 4000 వేల పెన్షన్, వికలాంగులకు 6000, ఉపాధి హామీ కూలికి కనీస వేతనం రోజుకు 400 రూపాయలు అనేక పేద ప్రజల కోసం మేనిఫెస్టో విడుదల చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెస్దే అని కొనియాడారు. ప్రజలు యువత రైతులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు.

About Author